ఎండు ఖర్జూరం తేనే
ఎండు ఖర్జూరాలు ఆరోగ్యానికి చాలామంచిదని మనందరికీ తెలుసు. అయితే వీటిని తేనెలో వారంరోజులు పాటు నానబెట్టి తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం..ఖర్జూరం తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు దగ్గు, జలుబు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి బాగా ఉపయోగపడుతుంది. ఒక చిన్న కంటైనర్లో మూడొంతుల తేనె, ఒక వంతు గింజ తీసిన ఎండు ఖర్జూరాలను వెయ్యాలి. వీటిని బాగా కలిపి, మూతపెట్టి వారం కదలకుండా ఉంచాలి. వారం తర్వాత రోజుకు ఒకటి, రెండు చొప్పున ఈ ఖర్జూరాలను తినొచ్చు. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జబ్బుల బారిన పడకుండా ఉండొచ్చు. నిద్రలేమితో బాధపడేవారు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతాం. ఒత్తిడిని దూరమవుతుంది. ఈ మిశ్రమంలోని యాంటీ బయాటిక్ గుణాల వల్ల గాయాలు త్వరగా మానతాయి. మెమోరీపవర్ పెరుగుతుంది. చిన్నారులు చదువుల్లో చురుగ్గా ఉంటారు. ఈ మిశ్రమంలో క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనతను తగ్గించి, ఎముకలను బలంగా మారుస్తుంది. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు వారంలో మూడు రోజులు ఖర్జూరాలు తింటే ఫలితం ఉంటుంది.